చిర్రి బాలరాజు సమక్షంలో జనసేనలో చేరికలు

పోలవరం, జనంకోసం జనసేన 69వ రోజులో భాగంగా బుట్టాయిగూడెం మండలంలో ముయ్యిబోయిన వినోద్, సి.హెచ్.వీరాస్వామి, కె. నాగరాజు, చ్ బాబురావు ఆధ్వర్యంలో జనంకోసం జనసేన కార్యక్రమంలో వేపులపాడు గ్రామంలో సుమారు 150 కుటుంబాలు జనసేన సిద్ధాంతాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు మాట్లాడుతూ వీరమహిళలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో చేరడం సంతోషంగా ఉందన్నారు. జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోకి బలంగా వెళ్తుందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలికారు. చిర్రి బాలరాజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసే సేవా కార్యక్రమాలు అందరికి వివరించడం జరిగింది. మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అందరికి అర్ధమయ్యేలా వివరించారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అవుతున్నా కనీసం అభివృద్ధి అనేది కనిపించడం లేదన్నారు. కనీసం అధికార ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గ్రామానికి వెళ్ళడానికే సరైన రోడ్డు లేని అసమర్ధ పాలనా అని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి తమకు అవకాశం ఇస్తే అభివృద్ధి ఎలావుంటుందో చూపిస్తామని, అందరికి అన్ని సదుపాయలు సమాకూర్చే భాద్యత తీసుకుంటామని, పార్టీలో చేరిన వారు ఎవరు కూడా అధికార పార్టీకి భయపడనవసరం లేదని, మేము తోడుగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరిగి జనసేన మేనిపెస్టో ని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి ప్రసాద్, పాదం కృష్ణ, సత్యనారాయణ, మెట్ట బుచ్చిరాజు, వీరమహిళలు జె. అక్కమ్మ కె.దుర్గమ్మ, ఎం.చుక్కమ్మ, కె.లక్ష్మి మరియు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.