మాకినీడి శేషుకుమారి సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ జిల్లా పిఠాపురం పట్నంకి చెందిన కారపురెడ్డి వెంకటరమణ, మణికంఠ, దుర్గాప్రసాద్, యువకులు జనసేనపార్టీ సిద్ధాంతాలు,
అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి విజయదశమి రోజున నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి శేషుకుమారి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ముందుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పిఠాపురం నియోజకవర్గం తరఫున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసి, జనసేనాని ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చామని ఇంకా పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీస్థాయిలో జాయినింగ్ లు ప్రతి గ్రామం నుంచి సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని, సమస్యలపై జనసేన పార్టీ నిజాయితీగా పోరాడుతుందని దైర్యంగా పార్టీ బలోపేతానికి కృషిచేసి అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేద్దాం అని పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే పార్టీ బలోపేతం కోసం నాయకులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా.మాకినీడి వీరప్రసాద్, పుణ్యమంతుల మూర్తి, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి, బుర్రా సూర్యప్రకాష్, మేళం బాబి, తోట ప్రసాద్, పబ్బినీడి దుర్గాప్రసాద్, నామా శ్రీకాంత్, షేక్ మస్తాన్, మూతి సురేష్, సబితా సాయి వర ప్రసాద్, కడలి వినోద్ కారపురెడ్డి, వెనకటికి రమణ, కారపురెడ్డి మణికంఠ, పొన్నాడ మురళి కృష్ణ, రాయవరపు, శివ దుర్గ, జ్యోతుల చిన్న, బంతిముల ప్రసాద్, పార్టీ నాయకులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.