పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరికలు
కాకినాడ రూరల్, వలసపాకల గంగరాజు నగర్ రోడ్ నెంబర్ 1 లో గల జనసేన పార్టీ కార్యాలయంలో వాకలపూడి సంతోష్ నగర్ ప్రాంత వైసీపీకి చెందిన యువత, పెద్దలు, మహిళలు సుమారు 30 మంది జనసేన నాయకులు గంటా ప్రసాద్, గేదల చిన్నరావు, ఎన్ శ్రీనివాస్, కె.శ్రీనివాస్ రావుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మెండు సందీప్ నాయకత్వంలో జనసేన-టీడీపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-06-at-16.51.10-1024x462.jpeg)