పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ వైసీపీ, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు 25 మంది థామస్, ముద్దాల సత్తిబాబు, తిరుమలశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు రెడ్డిపల్లి కిషోర్, గుమ్మడి వీరబాబు నాయకత్వంలో కాకినాడ గోదారిగుంటలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.