పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం హార్బర్ పేటకు చెందిన యువత జనసేన పార్టీ మత్స్యకార నాయకులు పాలేపు ఈశ్వర్ మరియు వలసపాకల గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు సాగిరెడ్డి వెంకటేశ్వరరావు (పండు నాయుడు) పాలేపు శివ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో సుమారు 50 మంది యువత, మహిళలు ఒలేటి శ్రీను నాయకత్వంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు.