శెట్టిబత్తుల రాజబాబు సమక్షంలో జనసేనలో చేరికలు
అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం, వాసాలతిప్ప గ్రామానికి చెందిన సుమారు 50 మంది అగ్నికుల క్షత్రియ యువకులు జనసేనపార్టీ సిద్ధాంతాలు, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి శనివారం నియోజకవర్గ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి శెట్టిబత్తుల రాజబాబు సాధరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్బంగా రాజబాబు మాట్లాడుతూ… మీ అందరికీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అగ్నికుల క్షత్రియుల సమస్యలపై జనసేనపార్టీ నిజాయితీగా పోరాడుతుందని దైర్యంగా పార్టీ బలోపేతానికి కృషిచేసి అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కౌన్సిలర్లు, జిల్లా నాయకులు, సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-01-at-15.49.41.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-01-at-15.49.44.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-01-at-15.49.38.jpeg)