వరికూటి నాగరాజు సమక్షంలో జనసేనలో చేరికలు

  • రామభద్రపురం గ్రామంలో “నా సేన కోసం నా వంతు”

దర్శి నియోజకవర్గం, తాళ్లూరు మండలం రామభద్రపురం గ్రామంలో దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు, ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు సమక్షంలో జనసేన నాయకులు యర్రంశెట్టి చిరంజీవి ఆధ్వర్యంలో గాజుల సుబ్రమణ్యం సహకారంతో జనసేన పార్టీలో సుమారు 100 మంది పైగా గ్రామస్తుల చేరికలు. వరికూటికి పూలస్వాగతంతో ఆహ్వానించి శాలువాతో సత్కరించిన గ్రామస్తులు. అనంతరం జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసైనికులు, వీర మహిళలు. ఈ కార్యక్రమంలో పొదిలి రెడ్డి, పిచ్చిరెడ్డి, సుబ్రహ్మణ్యం, సారెడ్డి చిన్నరామిరెడ్డి, గంగిరెడ్డి కోటిరెడ్డి, గంగిరెడ్డి జయరామిరెడ్డి, తల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి, గంగిరెడ్డి చిన్నకోటిరెడ్డి, గంగిరెడ్డి సుబ్బారెడ్డి, సానే కొండలు, షేక్ మస్తాన్ వలి, వేమా నరసయ్య, షేక్ మహబూబ్ బాషా, వీరబ్రహ్మం మరియు దర్శి, తాళ్లూరు మండల జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.