నూతన పల్లెలో జనసేన పార్టీలో చేరికలు

కోడుమూరు నియోజకవర్గం: కర్నూలు రూరల్ మండల పరిధిలో గల నూతన పల్లె గ్రామం నుంచి కర్నూలు జిల్లా ముఖ్య నాయకులు పాణ్యం నియోజకవర్గ ఇంచార్జి సురేష్ బాబు చింత సమక్షంలో ఆకెపోగు రాంబాబు ఆధ్వర్యంలో శ్రీమతి రవణమ్మ, శ్రీమతి సుజాత మరియు వారి మిత్ర బృందం జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరడానికి వచ్చిన వీరమహిళలను జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇంచార్జి చింతా సురేష్ బాబు జనసేన పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం చింతా సురేష్ బాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్తుందని అందుకుగాను మనమందరం కలిసి పార్టీ కోసం పని చేసి జనసేన పార్టీ గెలుపే ధ్యేయంగా ముందుకెళదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు ఆకెపోగు రాంబాబు, లక్ష్మన్న, కొత్తకోట మహబూబ్ బాషా, పైగేరి చిన్న ఎల్లప్ప, కృష్ణబాబు పాణ్యం నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.