జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు నచ్చి వైసీపీ, టీడీపీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు అమలదాసు రాఘవ, కొల్లాబత్తుల శేషయ్య, పొన్నాడ శ్రీను, తిరుమలశెట్టి చక్రం, గోటూరి వెంకటేష్, కొల్లు శ్రీనివాస్, మడిచర్ల గంగరాజు, సుందరపల్లి సత్తిబాబు తదితరులు. సుమారు 80 మంది జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సూచన మేరకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో, గంగనపల్లి గ్రామ అధ్యక్షులు కుర్ర నాగబాబు నాయకత్వంలో రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరికి జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికిన శిరంగు శ్రీనివాస్ కరెడ్ల గోవింద్. ఈ కార్యక్రమంలో స్థానికులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.