బొమ్మిడి నాయకర్ సమక్షంలో చేరికలు

నరసాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు బొమ్మిడి నాయకర్ ఆశయాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం లక్ష్మణేశ్వరం గ్రామం కట్టా వారి మెరక కు చెందిన వైసీపీ కార్యకర్తలు కట్టా రామాంజనేయులు, బాలం ఉపేంద్ర, కట్టా శ్రీను, కవురు శ్రీను, కట్టా త్రిమూర్తులు, దంపనబోయిన సురేష్, కట్టా సుధాకర్, వేండ్ర శివ, కట్టా చందు, కవురు కార్తీక్, కవురు ప్రసాద్, చెల్లబోయిన భరత్, దొంగ చిన్న, మామిడిశెట్టి సత్యనారాయణ, గుడాల రమేష్, గుబ్బల సిద్ధి గణేష్, దంపనబోయిన శ్రీరంగ అలాగే దాదాపుగా 50 మంది వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి నాయకర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.