పరిటాల గ్రామంలో జనసేన పార్టీలో చేరికలు

కంచికచర్ల: ప్రతి ఒక్క జనసైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ ఘన విజయం సాధించి పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా గెలుపొందేలా కృషి చేయాలని కంచికచర్ల మండల అధ్యక్షుడు నాయిని సతీష్ పేర్కొన్నారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన గ్రామ కమిటీ సమావేశంలో గ్రామానికి చెందిన పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలపై జనసైనికులు దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. గ్రామంలో నిరుపేదలకు పట్టాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన వైసిపి అరాచకాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆయన సూచించారు. జగనన్న కాలనీ పేరుతో గ్రామస్తులను మోసం చేసిన విధి విధానాలను ప్రతి ఒక్కరు ఎండగట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పరిటాల గ్రామ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి పురమా ప్రసాద్, పరిటాల గ్రామ నాయకులు పురమా కాలేశ్వరరావు, కొమ్మ నరేష్, పుప్పాల వేణుగోపాల్, తమ్మిశెట్టి గంగాధర్, మాణిక్యాల బ్రహ్మం, రామకృష్ణ, వేముల ఆదిత్య, తాటి శ్రీమంత్, రామిశెట్టి చందు, మలిశెట్టి నరేష్, మలిశెట్టి గోపాలకృష్ణ, పురమా రత్నబాబు, పరిటాల గ్రామ వీరమహిళ పురమా లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.