కొరిపల్లి గ్రామంలో జనసేన-టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రచారం

కాకినాడ రూరల్: కరప మండలం, కొరిపల్లి గ్రామంలో స్థానిక జనసేన, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జనసేన-టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ టీడీపీ కాకినాడ రూరల్ కో -ఆర్డినేటర్ మాజీ శాసనభ్యులు శ్రీమతి &శ్రీ పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పవిత్ర మైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తు ఫై వేసి అఖండ మెజారిటి తో గెలిపించాలని కోరుతూ, అదేవిధంగా గ్రామం లోని ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్ డి ఏ ప్రభుత్వం హయాంలో మౌలిక వసతులు కల్పిస్తామని, మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని, యువతకి ఉద్యోగాలు కల్పనకు కృషి చేస్తామని, మీ సమస్యలను పరిష్కరిస్తామని, ఈ జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధి లేకుండా, యువత భవిష్యత్ పాడుచేసాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం, నాయకులు రెడ్డి సత్యనారాయణ, నూరుకుర్తి సూరిబాబు, దెయ్యాల రాంబాబు, దెయ్యాల త్రిమూర్తులు, దెయ్యాల వీరబాబు, బీజేపీ, జనసేన రాష్ట్ర, మండల, గ్రామ స్థాయి నాయకులు, స్థానిక జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.