వాకలపూడిలో ఇంటింటా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రచారం

జనసేన నాయకులు పేదిరెడ్ల ప్రసాద్ రావు, రెడ్డి చందు, గ్రామ అధ్యక్షులు గంట ప్రసాద్ ఆధ్వర్యంలో వాకలపూడి రామకృష్ణ నగర్, శెట్టిబలిజ ప్రాంతాలలో జనసేన నాయకులు పృద్వి రాజు, టీడీపీ నాయకులు, నూరుకుర్తి వెంకటేశ్వర రావు, రాందేవు సీతయ్య దొర, బీజేపీ నాయకులు రంభాల వెంకటేశ్వర రావు, యార్లగడ్డ రాంకుమార్, జనసేన నాయకులు గింజల శ్రీనివాస్ లతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని కోరిన జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వంలో 6 నెలలు లోపుగా మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని, స్థానిక యువతకి కంపినిలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వాయు కాలుష్య నియంత్రణ ఫై శ్రద్ద చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.