జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల ఉమ్మడి కమిటీ సమావేశం

రంపచోడవరం, జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీలు ఉమ్మడి కమిటీ సమావేశం సోమవారం రంపచోడవరం నియోజవర్గం భాను ఫంక్షన్ హాల్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మూడు పార్టీ నేతలు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలు ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి మిరియాల శిరీష దేవి మరియు రంపచోడవరం నియోజవర్గం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి నాయకులకి కమిటీ విధివిధానాలపై ప్రతి ఒక్కరు ఉమ్మడిగా ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు కొరకు పనిచేయాలని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కొణతం శ్రీనివాస్ రంపచోడవరం మండల అధ్యక్షులు జనసేన పార్టీ పాపోలు శ్రీనివాస్ గారు, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, సీత కట్టా ప్రసాద్, రాజొవమ్మిగిం మండలం యూత్ ప్రెసిడెంట్ కొచ్చా లోకేష్, ఏ బద్రి, మారేడుమిల్లి మండలం అధ్యక్షులు జనసేన పార్టీ మల్లా దుర్గాప్రసాద్, బీశెట్టి సత్య గంగవరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు కుంజు సిద్దు, శివ మరియు తెలుగుదేశం బిజెపి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.