జనసేన, టీడీపీ, బీజేపీల ఉమ్మడి సమావేశం

నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇంచార్జి పొత్తూరి రామరాజు మరియు బీజేపీ ఇంచార్జి పులపర్తి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన, టీడీపీ, బీజేపీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జిలు మరియు నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిని బలంగా జనంలోకి బలంగా తీసుకెళ్ళి అధికారం సాధించే దిశగా అందరం కృషి చెయ్యాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.