Nellore: నిరుపేద కుటుంబానికి అండగా జనసేన

ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం మొండి వైఖరికి నిలువెత్తు సాక్ష్యం. మర్రిపాడు మండలంలో నివసిస్తున్న కుంట నరసయ్య వసతి లేక చెట్ల కింద నివసిస్తున్న తరుణంలో ఈమధ్య పడిన అకాల వర్షాల కారణంగా తను నివసించిన ప్రదేశం మొత్తం వర్షపు నీటితో మునిగి పోయింది స్థానిక జనసైనికులు ఆ సమాచారాన్ని తెలుసుకుని జనసేన నాయకులకు తెలియచేయగా వెంటనే స్పందించి పై అధికారులకు తెలియజేస్తామని వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి వనం పవన్ కుమార్, మర్రిపాడు మండల ప్రచార కార్యదర్శి ఉదయ్, గంటా అంజి,విష్ణు కుమార్ వినోద్, చిన్నా జనసేన తదితరులు పాల్గొన్నారు.