పిఠాపురం, చిత్రాడ వద్ద జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం మరియు విజయోత్సవ సభకు విచ్చేసే సుదూర ప్రాంతాల నుండి వచ్చి స్థానిక పిఠాపురం పాదగయ కుక్కుటేశ్వరదేవస్థానం దర్శనం చేసుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు వెజిటబుల్ బిర్యానీ, కర్రీ, మజ్జిగ, వాటర్ 5000 మందికి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి 5 లక్షల మంది పైగా హజరుకావడం జరుగుతుందని, అందులో భాగంగా 2 రాష్ట్రాల నుండి వచ్చే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు దేశంలోనే ప్రసిద్ధమైన పిఠాపురం పాదగయ క్షేత్రంలో గల దేవాలయాలను సందర్శించిన అనంతరం శుక్రవారం వచ్చేవారి కోసం ఈ భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పై గల అభిమానంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జ్యోతుల శ్రీనివాసు తెలిపారు.
Share this content:
Post Comment