కందులు దుర్గేష్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జ్యోతుల

పిఠాపురం నియోజవర్గం: ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా జనసేన అధ్యక్షులు కందులు దుర్గేష్ జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కందులు దుర్గేష్ జన్మదినోత్సవ వేడుకలలో పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు కందులు దుర్గేష్ గారిని పూలమాలవేసి, సాలువాతో సత్కరించి ఆయనకు స్వీట్స్ అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ సౌమ్యులు, మంచివారు, నిగర్వి, అజాతశత్రువు అయిన కందులు దుర్గేష్ గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన నాయకత్వంలో జనసేన పార్టీ 2024 సంవత్సరంలో విజయకేతనం ఎగరవేయాలని జిల్లాలో ఎక్కువ సీట్లను పొందాలని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు ఆకాంక్షించారు. జ్యోతుల శ్రీనివాసు వెంట మేడిబోయిన శ్రీను, జ్యోతుల సీతారాంబాబు, మంతెన గణేష్, చేశెట్టి భద్రం, జ్యోతుల శివ, అడపా శ్రీను తదితరులు పాల్గొన్నారు.