అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతుల

పిఠాపురం: గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామం నందు జీలకర్రవారివీధిలో గల కనకదుర్గమ్మగుడి నందు దసరా సందర్భంగా గత 9 రోజుల నుండి అమ్మవారి ఉత్సవాలను, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల ఉత్సవాల అనంతరం మహా అన్నదానకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహా అన్నదానకార్యక్రమానికి ఆలయకమిటి సభ్యులు ఆహ్వానం మేరకు జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు బుధవారం దుర్గాడ గ్రామంలో కనకదుర్గగుడిని సందర్శించి అమ్మవారిని దర్శనం చేసుకుని, అనంతరం కనకదుర్గగుడి ఆలయం కమిటి వారు నిర్వహిస్తున్న మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రావుల రమణ, జీలకర్ర కాపు, మేడిబోయిన సత్యనారాయణ, కీర్తి కొండబాబు, జ్యోతుల గోపి, అయినవిల్లి శ్రీను, సాధనాల చంటి రామ్, ఆకుల అర్జున్ మేడిబోయిన శ్రీరాములు, జ్యోతుల శివ, మేడిబోయిన శ్రీను తదితరులు ఉన్నారు.