జనసైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన జ్యోతుల

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన జనసైనికులు పెంకే గుర్రయ్య మరియు కర్రి మంగ కారు ప్రమాదంలో మరణించడం జరిగింది. బుధవారం పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు చేబ్రోలు గ్రామంలో గల స్వర్గీయ పెంకె గుర్రయ్య మరియు కర్రి మంగ ఇళ్లకు వెళ్లి పరామర్శ చేశారు. రెండు కుటుంబాలు కూడా నిరుపేదలు కాబట్టి మరణాలకు సంతాపాలను తెలియజేస్తూ వారి యొక్క అవసరాల నిమిత్తం ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని సహాయంగా అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏ అవసరమైనా నన్ను సంప్రదించాలని పెంకె గుర్రయ్య తనయుడు పెంకే వెంకటేష్ కు కర్రి మంగ తనయడు కర్రి మణికంఠలకు తగు భరోసా ఇచ్చారు. జ్యోతుల శ్రీనివాసు వెంట ఆకుల శ్రీను, గంటా గోపి, వులిశెట్టి సుబ్బారావు, దమ్ము చిన్న, గంటా గంగాబాబు, కీర్తి చిన్న, తేటకాయల శ్రీను, జ్యోతుల సీతారాంబాబు, పోలవరుపు మోహన్, పెంకే శ్రీను తదితరులు పాల్గొన్నారు.