నాదెండ్ల మనోహర్ ని కలిసిన జ్యోతుల శ్రీనివాసు

తుని: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా 2వ రోజు సోమవారం ఉదయం రాజమండ్రి షెల్టాన్ హొటల్ నందు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు గౌరవసూచకంగా కలిసి నాదెండ్ల మనోహర్ ను ఘనంగా సత్కారించారు. జ్యోతుల శ్రీనివాసు వెంట పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, జ్యోతుల వాసు, నేమాల కన్న, కీర్తి చిన్నా, కొలా నాని, మేడిబోయిన హరికృష్ణ ఉన్నారు.