తంగెళ్ల శ్రీనివాస్ ను కలిసిన జ్యోతుల శ్రీనివాసు
పిఠాపురం నియోజవర్గం: పిఠాపురం జనసేన ఇన్చార్జిగా నియమించబడిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నియోజవర్గ ఇన్చార్జిగా నియమించిన తర్వాత మొట్టమొదటిగా శనివారం పిఠాపురం మున్సిపాలిటీ నందు గల పాదగయక్షేత్రానికి విచ్చేసిన సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కలిసి ఆయనకు పూలదండలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తో కలిసి పని చేసి జనసేన పార్టీ 2024 సంవత్సరంలో పిఠాపురం నియోజవర్గం నందు నెగ్గించుకొనుటకు తగిన కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గస్థాయి నాయకులు, జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-9.47.31-PM-1-1024x576.jpeg)