నిరుపేద మహిళకు సహాయం అందించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం, తాటిపర్తి గ్రామానికి చెందిన గుండుబిల్లి వీరబాబు వ్యవసాయకూలీ గుండుబిల్లి వీరబాబు 20 సంవత్సరాల క్రితం గుండెపోటుతో మరణించారు. గుండుబిల్లి వీరబాబు కుటుంబం చాలా బీద కుటుంబం. వీరబాబు వ్యవసాయ కూలీ జీవనోపాధి ద్వారా వీరి కుటుంబం గడుస్తూ ఉండేది. వీరబాబు బార్య గుండుబిల్లి గంగభవానీ గృహిణి కావడం, గుండుబిల్లి వీరబాబు మరణం యిమెను మరింత పేదరాలుగా మార్చింది. గుండుబిల్లి గంగభవానీ ఒంటరిమహిళ అయినా కాని కనీసం ప్రభుత్వం జగన్నన్న ఇళ్ళస్దలం ఇవ్వకపొవడం వల్లన ఇల్లు కూడా లేదు. ప్రస్తుతం గుండుబిల్లి గంగభవానీ ఒకదాత ఇచ్చిన ఇంటి వరండాలో నివాసం ఉంటున్నది. తాటిపర్తి జనసైనికులు ఫోన్ ద్వారా గుండుబిల్లి గంగభవానీ కుటుంబమునకు జరిగిన అన్యాయంను జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసుకు తెలియజేశారు. ఫోను ద్వారా విషయం తెలుసుకున్న జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు శుక్రవారం తాటిపర్తి గ్రామం నందుగా గుండుబిల్లి గంగభవానీ అద్దెనివాసంనకు వెళ్లి గుండుబిల్లి గంగభవానీ తాటిపర్తి గ్రామ జనసైనికులతో కలిసి వెళ్ళి వారి కుటుంబ పరిస్థితిని ఆరా తీసి గుండుబిల్లి గంగభవానీకి కిరాణా సామాన్లు, నగదు, 25 కేజీల బియ్యం సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి జనసేన నాయకులుగాడిదల బుజ్జి, మాదేపల్లి కృష్ణ, ఆకుల వెంకటరమణ, కొన రాధకృష్ణ, అడబాల వెంకన్న, తోలాటి రాంబాబు, గొకరకొండ కొండబాబు, కర్రెడ్ల పెద్దకాపు, నల్లల నాగబాబు, వీరంరెడ్డి దివాణం, మేడిబోయిన హరికృష్ణ, బండి శివ తదితరులు ఉన్నారు.