అగ్నిప్రమాదం బాధితులకు సహాయం అందించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం టౌన్ నందు 1 వార్డు అగ్రహారం నందు ఏడిద సూర్యకాంతం తాటియాకుల ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. ఇంటి నందు గల అన్ని నిత్యవసర వస్తువులు, బట్టలు సర్వం కాలిపోయి నిరాశ్రయులుగా సహయార్దులుగా సహాయం కొరకు ఎదురుచూస్తూన్న సందర్భంలో పిఠాపురం చెందిన దళితసంఘ వైస్ ప్రెసిడెంట్ వేమగిరి రమేష్ పొన్ ద్వారా జనసేన నాయకులు మరియు వ్యవస్దస్దాపక అధ్యక్షులు సాయిప్రియ సేవాసమితి జ్యోతుల శ్రీనివాసుకి అగ్నిప్రమాదం విషయం తెలియజేయగా జ్యోతుల శ్రీనివాసు వెంటనే స్పందించి సోమవారం సాయంత్రం అగ్నిప్రమాద బాదితులైన ఏడిద సూర్యకాంతం కు కాలిపోయిన ఇంటికి బియ్యం, కిరణసామాన్లు, దుప్పట్లు, నగదు ఆమెకు అందించారు. జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ఏడిద సూర్యకాంతం ఇల్లు పునర్నిర్మాణం చేసుకొనే సందర్బంలో నాకు తెలియజేస్తే నేను తగు ఆర్థికసహాయం చేస్తామని హామి ఇచ్చారు. ఈ సహాయ కార్యక్రమంలో వేమగిరి రమేష్, జనసేన పిఠాపురం నగర నాయకులు అల్లం కిషోర్, ఏడిద రాము, రాజు, పెద్దాడ శేఖర్, వేమగిరి శ్రీను, అల్లం శ్రీను, వి శ్రీకాంత్, జ్యోతుల సీతరాంబాబు, గంటా గోపి, జ్యోతుల వాసు, కొలా నాని తదితరులు పాల్గొన్నారు.