నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జ్యోతుల

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురంటౌన్ కు చెందిన అగ్రహారపు శంకరయ్య పండ్ల వ్యాపారి అగ్రహారపు శంకరయ్య కొన్ని నెలల క్రితం గుండెపోటుతో మరణించారు. అగ్రహారపు శంకరయ్య కుటుంబం చాలా బీద కుటుంబం. అగ్రహారపు శంకరయ్య పండ్ల వ్యాపారం ద్వారా జీవనోపాధితో వీరి కుటుంబం గడుస్తూ ఉండేది. శంకరయ్య కు 6 సంవత్సరాల కుమారుడు, 4 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్ళు కావడం వలన శంకరయ్య బార్య అగ్రహారపు స్వప్న గృహిణి కావడం ఎటువంటి ఉఫాధి లేదు. శంకరయ్య మరణం వీరిని మరింత పేదవారీగా మార్చిందనె విషయం తెలుసుకొన్న జనసేన నాయకులు గంజి గోవిందరాజులు పోన్ ద్వారా జ్యోతుల శ్రీనువాసుకు ఫోన్ ద్వారా అగ్రహారపు శంకరయ్య కుటుంబ ఆర్దికపరిస్దితిని, జరిగిన అన్యాయంను జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు కి తేలియజేశారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు బుధవారం పిఠాపురం నందు గల అగ్రహారపు శంకరయ్య అద్దెనివాసంనకు వెళ్లి అగ్రహారపు శంకరయ్య కుటుంబాన్ని కలిసి వారి కుటుంబ పరిస్థితిని ఆరా తీసి వారికి నగదు, కిరాణా సామాన్లు మరియు 25 కేజీల బియ్యం వారికి సహాయంగా అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ భవిష్యత్తులో అనగా ప్రతి సంవత్సరం విద్యాసంవత్సరం ఆరంభంలో నాకు తెలియజేస్తే అగ్రహారపు శంకరయ్య పిల్లలకు విద్య నిమిత్తం తగు ఆర్ధికసహయం అందిస్తాని వారికి హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంజి గోవిందరాజులు, గంటా గోపి, బొజ్జ మహేష్, దాసరి దత్తు, బండి శివ, కొలా నాని తదితరులు ఉన్నారు.