చింతల శ్రీను అండగా నిలిచిన కె.కోటపాడు జనసేన
మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం, కె.కోటపాడు గ్రామం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చింతల శ్రీను ఇటీవల కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న కారణంగా అతనికి నియోజకవర్గం నాయకులు, జనసైనికులు సహకారంతో కె.కోటపాడు మండల నాయకులు కుంచా అంజి ఆధ్వర్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం 16000/- చింతల శ్రీనుకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం నాయకులు ఈశ్వర్, రాయపరెడ్డి కృష్ణ, రాంబాబు, వై.ప్రసాద్, కె.కోటపాడు జనసైనికులు ఈశ్వరరావు రాజు, పైడిరాజు, సూర్య, గోవింద( గోల్డ్) గంగునాయుడు పరమేశం ఆనంద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జనసైనికులకు కష్టం వస్తే జనసేన పార్టీ అండగా ఉన్టుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-09-at-19.34.05-1024x460.jpeg)