వీరాంజనేయ తీర్థం సందర్భంగా కబాడి పోటీలు

ఎస్ కోట నియోజకవర్గం, తిమిడి గ్రామంలో వీరాంజనేయ తీర్థం సందర్భంగా కబాడి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు శనివారం రాత్రి 50 కబాడి టీమ్స్ ఆడించడం జరిగింది. కబాడి పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 8000 రూపాయలు బోనంగి టీమ్రెం, డవ బహుమతి 5000 రూపాయలు పెడకందేపల్లి మూడవ బహుమతి 3000 రూపాయలు వెంకటరమణ పేట టీమ్ గెల్చుకోవడం జరిగింది. తిమిడి పాపల వీది వారి ఆర్ధిక సహకారముతో సర్పంచ్ వబ్బిన త్రినదమ్మ బహుమతులు ప్రదానం చేశారు.