జనసేన ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు

మాడుగుల, యువతను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా మాడుగుల నియోజవర్గం, కోటపాడు మండలం, చౌడువాడ గ్రామంలో జనసేన పార్టీ తరఫున ఏర్పాటుచేసిన కబడ్డీ పోటీలను ప్రారంభించిన మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు గుమ్మడి శ్రీరామ్, పెందుర్తి నియోజకవర్గ నాయకురాలు పిన్నింటి పార్వతి. ఈ కార్యక్రమంలో కే కోటపాడు మండల జనసేన నాయకులు త్రినాధ్, రామునాయుడు, మూర్తి మరియు చౌడువాడ జనసేన నాయకులు కుంచ అంజి, కుంచ మనీశంకర్, శివ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.