వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్న కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి నియోజకవర్గం: తాడిపత్రి పట్టణ ప్రధాన కార్యదర్శి సయ్యద్ రసూల్, హరి, రాహుల్ ఆహ్వానం మేరకు పట్టణంలోని పాతకోట కాలనీలో వినాయక చవితి ఉత్సవాలలో తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు హర్షద్ అయూబ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండా శివ, మణికంఠతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాతకోట కాలనీ యువకులు డ్రమ్స్ వాయిస్తూ పూలతో స్వాగతం పలికి పూజా కార్యక్రమానికి తీసుకెళ్లారు. పూజా కార్యక్రమం అనంతరం కదిరి శ్రీకాంత్ రెడ్డి స్థానిక పాతకోట యువకులతో ఉత్సవం గురించి చర్చిస్తూ ఎటువంటి గొడవలకు పోకుండా కాలనీ వాసులందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాన్ని జరుపుకోవాలని యువకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు హేమంత్, రబ్బానీ, రాయుడు మరియు జనసైనికులు శ్రీను, శ్రీకాంత్, దస్తగిరి, అచారి, శివ, అమరేష్, అశోక్, పవన్, సుధీర్, జగదీష్, శషి, అరవింద్, చంద్ర, నరేష్ తదితరులు పాల్గొన్నారు.