కాలు విరిగిన జనసైనికునికి ఆర్థికసాయం చేసిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడపత్రి పట్టణంలోని పాతకోట కాలనీకు చెందిన దస్తగిరి అనే జన సైనికుడికి 15 రోజుల కిందట యాక్సిడెంట్ జరిగి కాలు విరగడం జరిగింది. ఆపరేషన్ కు దాదాపుగా 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ విషయాన్ని స్థానిక జనసేన నాయకులు సయ్యద్ రసూల్ ద్వారా విషయం తెలుసుకొన్న నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి స్వయంగా జనసైనికుడి ఇంటికి వెళ్లి పరామర్శించి అతనికి మరియు అతని కుటుంబానికి ధైర్యం చెప్పి తక్షణ సహాయంగా 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.