బండ్రెడ్డి రామకృష్ణను పరామర్శించిన కైకలూరు జనసేన నాయకులు

జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, తండ్రి అయిన బండ్రెడ్డి రామారావు శనివారం రాత్రి గుండెపోటుకు గురై మరణించారు. రామారావు మృతి పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రామారావు మృతి వార్త తెలుసుకున్న జనసేన నాయకులు రామకృష్ణ స్వగృహానికి వెళ్లి రామకృష్ణను పరామర్శించి ఓదార్పు అందించారు. రామకృష్ణను పరామర్శించిన వారిలో కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు రాష్ట్ర జాతీయ కాపు సంఘం(జెకెఎస్) అధ్యక్షుడు బెల్లంకొండ వెంకన్నబాబు, జనసేన జిల్లా కార్యదర్శి కూనసాని నాగబాబు, కైకలూరు నియోజకవర్గం జనసేన లీగల్ ప్రతినిధి తణుకుల రవితేజ, జె కె ఎస్ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు గళ్ళ రామాంజనేయులు, జెకెఎస్ దక్షిణ కోస్తా జిల్లాల అధ్యక్షుడు గౌరిశెట్టి నాగరాజు(జి ఎన్ ఆర్) మరియు కృత్తివెన్ను మండల ప్రధాన కార్యదర్శి కాజా మణికంఠ కార్యదర్శి బాడిత నాగబాబు, కార్యదర్శి పితాని సురేష్ మరియు జనసేన నాయకులు, జాతీయ కాపు సంఘం (జెకెఎస్) నాయకులు రామకృష్ణుని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.

Share this content:

Post Comment