కాకాని గోవర్ధన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం జిల్లా మంత్రి అదుపులో కాకాని గోవర్ధన్ రెడ్డి దయచేసి నోరు పెట్టుకుంటే మంచిది సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ ను రాహువు అని, వ్యవసాయ పంటల గురించి ఆయనకి ఏమి తెలుసని, 10 రకాల పంటలను చూపిస్తే 5 గుర్తుపట్టగలరా అని మాట్లాడటం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఒకటే అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా సత్య హరిచంద్రుడా, మీరేమైనా నిజాయితీపరుల అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా 3000 మంది కౌలు రైతులు చనిపోతే వాళ్లని ఆదుకోవాల్సింది పోయి, మీరు మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా, మీరు చెప్పినట్టు వ్యవసాయం గురించి తెలియకపోవచ్చు, కానీ రైతులు కష్టాలు తెలుసు వారిని ఏ విధంగా ఆదుకోవాలో తెలిసిన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా అధినేతకి శవరాజకీయం తెలీదు కోట్ల రూపాయలు అవినీతి చేయడం తెలియదు నీతి నిజాయితీగా ప్రజలని ఆదుకోవడం తెలుసు మీలాగా దోచుకోవడం తెలియదు పిచ్చి మందు పంచి ఎన్నికల సమయాల్లో ప్రజల ప్రాణాలు తీయడం మాకు చేత కాదు మేము నీతినిజాయితీగా నిబద్ధతతో ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల పక్షాన పోరాడటమే మా నాయకుడు యొక్క లక్షణం నోరు ఉంది కదా అని మీ ఇష్టానుసారం మాట్లాడటం కాదు ముందు మీ పరిపాలనని సరైన విధంగా పరిపాలించడం నేర్చుకోవాలని మేము మీకు తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో రహీం, కిష్టయ్య , చిన్న, శ్రీహరి, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.