డా.పెదపూడి విజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాకి శివ కుమార్

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్. పెదపూడి విజయ్ కుమార్ నెల్లూరు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ వెంకటాచలం మండల ప్రధాన కార్యదర్శి కాకి శివ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన దళిత జనసేన శ్రేణులకు, ఎస్సీలలో వెనకబడ్డ పేద ప్రజలకు అవకాశం కల్పించాలి అని కోరారు.

Share this content:

Post Comment