మహాత్మ జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన కాకినాడ సిటీ జనసేన
కాకినాడ సిటీ, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరుపుకోవడం ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం సంగిశెట్టి అశోక్ మాట్లాడుతూ వెనకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, సమాజంలో కుల పరమైన వివక్షలు, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఓలేటి రాము, సెక్రటరీ పులుగు సుమంత్, సెక్రటరీ దారపు ప్రకాష్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ దారపు శిరీష, ఐటీ విభాగం ఆచూర్ వరప్రసాద్, కోనాడ సత్యనారాయణ, నాయకులు చిట్టూరి మౌనిక్, రామకృష్ణ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-11-at-13.41.28-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-11-at-13.41.27-1024x768.jpeg)