నూతన కార్యవర్గ కమిటిని ప్రకటించిన కాకినాడ రూరల్ జనసేన

కాకినాడ రూరల్: జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల నూతన కార్యవర్గాన్ని సోమవారం కాకినాడ గొడరిగుంటలో గల జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఇంటివద్ద అయన సమక్షంలో, రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి తాటికాయల వీరబాబు, జిల్లా కార్యదర్శి సోదే ముసలయ్య, నేమం గ్రామ అధ్యక్షులు దాసరి శివ తదితరులు పాల్గొన్నారు.