Srikalahasti: జనసేన ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
శ్రీకాళహస్తి నియోజకవర్గం పెంకులపాడు ప్రభుత్వ పాఠశాలలో నవంబర్ 15వ తేది జనసేన నాయకుడు లక్ష్మీపతి ఆధ్వర్యంలో పుస్తకాలు మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా కార్యదర్శులు కొట్టే సాయి మరియు కళత్తూరు జయప్రకాష్ హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు పిల్లలకు బాలల దినోత్సవం గురించి తెలియజేసి బాగా చదువుకుని పెంకులపాడు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన లక్ష్మీపతి, శివ మరియు శశిలను మరియు పెంకాలపాడు యూత్ ని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళనాయకురాలు సునీత గారు మరియు మహేష్, చిరంజీవి, జయకిశోర్, సలీం, బద్రి తదితరులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-15-at-8.11.27-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-15-at-8.11.26-PM-1024x461.jpeg)