కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా!- అమిలినేని

  • 114 చెరువులకు నీరందించడమే నా ఎజెండాగా పని చేస్తా
  • వలసలు నివారించి పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా
  • శీబావి గ్రామంలో టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఎన్నికల ప్రచారం ప్రారంభం.

కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా అని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. గురువారం మండల పరిధిలోని గోళ్ళ పంచాయతీ పరిధిలోని శీబావి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి తనను గెలిపిస్తే గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని అన్నారు. మీలో ఒకడిగా.. మీ బిడ్డ గా.. అన్నగా తమ్ముడిగా ఉంటా అన్నారు. వైసీపీ వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు అని అన్నారు. 114 చెరువులకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక ప్రాంతానికి వలసలు వెళ్ళకుండా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయేది జనసేన టిడిపి ప్రభుత్వం అని ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారు అని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కళ్యాణదుర్గం ఇన్చార్జి బాల్యం రాజేష్ జనసేన వీర మహిళలు షేక్ తార మమత జనసేన నాయకులు వంశీ కాంతా రాజ్ జయకృష్ణ ఆంజనేయులు జాకీర్ రాయుడు అనిల్ గురుమూర్తి టిడిపి నాయకులు కార్యకర్తలు మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.