స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కళ్యాణదుర్గం జనసేన
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పట్టణం, మారంపల్లి వీధిలో ఉన్న పాఠశాలలో జనసేన పార్టీ తరపున 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది… దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఎందరో మహనీయులు గురించి చిన్న పిల్లలకు వివరించడం జరిగింది… భరతమాత, గాంధీజీ, సరస్వతి దేవి ఫోటోలకు పూజలు చేసి కర్పూర హారతి ఇవ్వటం జరిగింది… బ్రిటిష్ వారి నుండి భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాటాలు ఉద్యమాలు చేసి అమర వీరులైన భరత మాత ముద్దు బిడ్డలను స్మరించుకుంటూ.. భారతదేశ పౌరులకు 75 వ స్వాతంత్య్ర దినోత్సవ అమృతోత్సవ శుభాకాంక్షలలు తెలియజేసిన అనంతపురం.. జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్.. అలాగే సెప్టెంబర్ రెండవ తేదీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం రోజున చిన్నపిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, జనసేన వీర మహిళ షేక్ తార, మమత, జాకీర్, చిత్తప్ప, హర్ష, మహేష్ పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-15-at-1.45.15-PM-1024x459.jpeg)