ఉగాది వేడుకల్లో కళ్యాణదుర్గం జనసేన నాయకులు

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో మంగళవారం టిడిపి క్యాంప్ ఆఫీస్ ప్రజావేదికలో ఘనంగా నిర్వహించిన ఉగాది వేడుకలకు టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమలినేని సురేంద్రబాబు గారు జనసేన పార్టీ వారిని కుటుంబ సభ్యులతో రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడంతో కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఇంచార్జ్ బాల్యం రాజేష్ & జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు లక్ష్మీ నరసయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది వేడుకలకు హాజరయ్యారు. వీరితోపాటు జనసేన కళ్యాణదుర్గం వీరమహిళలు షేక్ తార, మమత, కల్పన, కళ్యాణదుర్గం జనసేన ముఖ్య నాయకులు గంగరాజు, అనిల్ పాల్యం, చిత్తప్ప, సుధాకర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.