కళ్యాణదుర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పట్టణంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది… ఈ సమావేశంలో జనసేన పార్టీ బలోపేతం కొరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కృషిచేయాలో నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ వాల్ పోస్టర్లు విడుదల చేసి, గ్రామస్థాయిలోకి జనసేన పార్టీ విధివిధానాలను ప్రజలకు తెలియజేసే విధంగా పోస్టర్లు గ్రామాలలో అతికించడం జరుగుతుంది. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అందరూ ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేని సామాన్య వ్యక్తుల నుంచే నాయకులను తయారు చేయాలనే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ప్రకారం నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని అనంతపురం జిల్లా జనసేన జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ తెలియజేశారు. అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పలువురు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాల్యం రాజేష్, రమేష్, చంద్రమౌళి, జయకృష్ణ, ఆంజనేయులు, కాంత రాజ్, వంశీ, జాకీర్, జనసేన వీరమహిళలు షేక్ తార, మమత, త్రివేణి, రాఘవేంద్ర, రామలింగ, ముక్కన్నా, పవన్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.