‘నా సేన కోసం నా వంతు’ కోసం కళ్యాణం శ్రీనివాసరావు 3 లక్షల విరాళం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు మొదలుపెట్టిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమం మహా యజ్ఞంలా ముందుకు సాగుతుంది. అనేక మంది ఇప్పటికే జనసేన పార్టీకి విరాళాలు అందజేయగా తాజాగా కళ్యాణం శ్రీనివాసరావు(కెకె) మూడు లక్షల రూపాయలను అందించారు. కళ్యాణం శ్రీనివాసరావు – లక్ష రూపాయలు, ఆయన సతీమణి శ్రీమతి అనిత – యాభై వేల రూపాయలు, కుమార్తె డా. ఐశ్వర్య – యాభైవేల రూపాయలు మరియు బావ మరిది ఎన్నారై పగడాల ప్రదీప్ – లక్ష రూపాయలు జనసేన పార్టీ పిఏసి సభ్యులు కొణిదెల నాగబాబుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.