కాకర్ల హిందూ స్మశాన వాటికలో కంప చెట్లను తొలగించాలి: కాల్వ బాల రంగయ్య

గిద్దలూరు నియోజకవర్గం, అర్ధవీడు మండలంలోని కాకర్ల గ్రామంలో హిందూ స్మశాన వాటిక కంపచట్లతో నిండిపోవడంతో దహన సంస్కారాలకు, ఖర్మకాండలకు ఇబ్బందిగా ఉందని ప్రజలు జనసేన పార్టీ దృష్టికి తీసుకురాగా.. జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య ఈ సమస్యల వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి ఫోన్ ద్వారా తెలియపరచి, వీఆర్వో కు అర్జీ ఇచ్చి, సమస్యను వెంటనే పరిష్కరించవలసిందిగా కోరడం జరిగింది.