కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభం

బెజవాడలో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు నూతనoగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ను సెప్టెంబర్‌ 4న ప్రారంభించనున్నట్టు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలియ జేస్తూ వైకాపా ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. సిఎం జగన్‌ నేతృత్వంలో వచ్చిన ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తిచేసిందన్నారు. కోవిడ్‌ సమయంలో సైతం సిఎం జగన్‌ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ పనిచేస్తున్నారని శ్రీనివాస్‌ తెలియ జేసారు.