జనసేనలో చేరిన కంచర్ల ప్రకాశరావు

జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం
నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి అలాగే మంగళగిరి పట్టణ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా పనిచేసినటువంటి కంచర్ల ప్రకాశరావు జనసేన పార్టీలో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
తదనంతరం మీడియాతో చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల ప్రకాశరావు గారు జనసేన పార్టీలో చేరడం సంతోషమని.. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటామని.. అలాగే కలిసికట్టుగా నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

తదనంతరం కంచర్ల ప్రకాశరావు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బావజాలం మరియు పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరానని.. అలాగే పార్టీ ఆదేశాల మేరకు అనుగుణంగా పనిచేస్తానని జనసేన పార్టీ గెలుపు కోసం తన వంతుగా అందరితో కలిసి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, మంగళగిరి – తాడేపల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ వెంకట మారుతీ రావు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం సాంబశివరావు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, జనసేన పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షులు షేక్ కైరుల్లా, జనసేన పార్టీ మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మంగళగిరి-తాడేపల్లి జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని, మంగళగిరి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, మంగళగిరి మండల జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లేళ్ళ సాయి నందన్, తాడేపల్లి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, సీనియర్ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.