ప్రమాదంలో గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన కంచికచర్ల జనసేన పార్టీ కార్యకర్తలు

కంచికచర్ల, ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామ జనసైనికుదు జనసేన పార్టీ కార్యకర్త పెరుమాళ్ళ సురేష్ ను కంచికచర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నాయిని సతీష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు పరామర్శించారు. సురేష్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్న సురేష్ ప్రమాదానికి గురవడం దురదృష్టకరమని త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై జనసేన పార్టీ తరఫున తన గళం వినిపించాలని జనసేన పార్టీ కార్యకర్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పుట్టా స్వరూప, జనసేన పార్టీ కార్యకర్తలు కొఠారు దేవేంద, పుప్పాల వేణుగోపాల్, సాయి హేమంత్ పాల్గొన్నారు.