కాణిపాకం జనసేన ఆత్మీయ సమావేశం

కాణిపాకం జిల్లా, జనసేన పార్టీ సమావేశం ఎమ్మెస్ రెసిడెన్సిలో నిర్వహించడం జరిగింది. పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో పర్యటించి పార్టీలోకి ఆహ్వానించడం, బూత్ కమిటీలు నియమించటం, క్షేత్ర స్థాయి పర్యటించి పార్టీని బలోపేతం చేయటం కోసం కృషి చేస్తామని తీర్మానించడం జరిగింది. రాబోయే రోజుల్లో జిల్లాలో గట్టి పోటీ చేయడానికి ప్రణాళికలు తెలియజేస్తూ తీర్మానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ని 2024లో ముఖ్యమంత్రిగా చేయటమే మా ధ్యేయంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ ఏకే శరవణ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పూల ప్రభాకర్, జిల్లా అధికార ప్రతినిధి మట్టపల్లి మునిరాజులు, జిల్లా కార్యదర్శి నెహ్రు రాయల్ జిల్లా ఆర్గనైజేషన్ సెక్రెటరీ పూల హరిబాబు, రాజేష్, రామ్ చరణ్ జిల్లా అధ్యక్షులు బొల్లి రమేష్, పూతలపట్టు గంగాధరం, బాలు, కాణిపాకం హరి. మట్టపల్లి దిలీప్, చిరంజీవి యువత నియోజవర్గం నాయకులు కిషోర్, కిరణ్ , చైతన్య రాయల్, కల్లూరు లక్ష్మీనారాయణ రాయలు . ఎస్ఆర్ పురం చందు, జనసేన పార్టీ ఐరాల మండలం ఉపాధ్యక్షులు శీను ఈ సమావేశానికి పార్లమెంట్ స్థాయి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.