యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని పరామర్శించిన కాంతి శ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, ఎన్.జి.ఆర్ పురం పంచాయతి, ఎన్.జి.ఆర్ గ్రామానికి చెందిన జనసేన పార్టీకి చెందిన మైలపల్లి లక్కీ ప్రమాదవశాత్తు మే నెల 15న యాక్సిడెంట్ కు గురవ్వడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల జనసేన నాయకురాలు కాంతి శ్రీ.. మైలపల్లి లక్కీ ని పరామర్శించి.. మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమ్మోరు, యర్రయ్య, సతీష్, దుర్గారావు, నాని, బాబాజీ, వేణు, శంకర్రావు, జనసైనికులు పాల్గొన్నారు.