జనసైనికులను పరామర్శించి ఆర్దిక సహాయం అందించిన కాంతి శ్రీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, జి సిగడం మండలం, నిద్దాం పంచాయతీ సర్పంచ్ మీసాల రవికుమార్ పిలుపు మేరకు ఆ గ్రామానికి వెళ్లి గురువారం రెండు కుటుంబాలను ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. నిద్ధాం గ్రామ పంచాయతీ పరిధిలో జన సైనికులు చౌదరీ రమణ కుమారుడు గణేష్ కి ఏక్సిడెంట్ అయిన విషయం తెలుసుకుని శ్రీమతి కాంతి శ్రీ గ్రామానికి వచ్చి ఆర్ధిక సహాయం అందించారు. అలాగే కర్రి గొల్లారాజు పెరాల్సిస్ తో బాధ పడుతున్నారు.. ఈ విషయం తెలుసుకుని కాంతి శ్రీ గ్రామానికి వచ్చి ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఏర్నేన శ్రీరామ్మూర్తి బాలి నారాయణ రావు, ఏర్నెన గోవిందరావు మాస్టర్, దుర్గారావు, కాకర్ల బాబాజీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.