పంతం నానాజీని మర్యాదపూర్వకంగా కలిసిన కరప జనసేన నాయకులు

తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ రూరల్: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీని కరప మండల జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఫ్లవర్ బోకే, శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా నానాజీ మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి మండల స్థాయి నుండి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని..దిశ నిర్దేశం చేశారు. అలాగే గ్రామాల్లో పార్టీ యొక్క మేనిఫెస్టో, జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానజీ, జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, శ్రీనివాస్, సీహెచ్.అనిల్ కుమార్, రవి రాజ, టీ.యదిత్య తదితరులు పాల్గొన్నారు.