గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న కరాటే కళ్యాణి..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ షో 4 విజేత అభిజీత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి తన కుమారుడి తో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు కరాటే కళ్యాణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందని వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ వారు మొక్కలు నాటించే మంచి కార్యక్రమాన్ని నాతో చేయించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే  మొక్కలంటే నాకు చాలా ఇష్టం నేను ఎక్కువగా మొక్కలు పెంచుతాను అని తెలిపారు. ప్రజలందరిలో అవగాహన పెరిగేలా ఎవరికి వారు బాధ్యతగా మొక్కలు పెంచాలని కోరారు. ప్రముఖ నటి విజయశాంతి, డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్, బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ శివబాలాజీ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటమని కోరారు.